బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ.. బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ...
మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సుమారు రాత్రి 1 గంట సమయం లో ఇద్దరు దొంగలు తుఫాన్ బిల్డింగ్ లోని కాపర్ వైర్, సామాను చోరికి పాల్పడ్డారు. గ్రామంలో చోరికి పాల్పడిన దొంగలను చూసి గ్రామస్తుడు అప్రమత్తమై కేకలు వెయ్యగా గ్రామస్థులు వెంటపడ్డారు. చోరికి వచ్చిన ఇద్దరు లో ఒకరు తప్పించుకోగా ఇంకొకరు పట్టుబడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టుబడిన వ్యక్తి మచిలీపట్నంకి చెందిన వ్యక్తిగా గుర్తింపు. గ్రామస్తులు పట్టుకున్న దొంగను పోలీసులు మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది